న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కరోనా విలయం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. పోలీస్శాఖపై సైతం తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నెల ఒకటి నుంచి బుధవారం వరకు 1,700 మంది ఢిల్లీ పోలీసులు కొవిడ్కు పాజిటివ్గా పరీక్షించారని ఉన్నతాధికారులు తెలిపారు. పెరుగుతున్న కేసుల మధ్య అర్హులైన సిబ్బంది కోసం బూస్టర్ డోస్ వేసేందుకు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల ఒకటి నుంచి 12 మధ్య 1,700 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారని, వారంతా బాగానే ఉన్నారన్నారు.
ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారని, కోలుకున్న తర్వాత విధుల్లో చేరుతారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ పోలీస్ బలగాల్లో 80వేల మందికిపైగా సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జైసింగ్ మార్గ్లోని ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి బూస్టర్ డోసు వేయించినట్లు ఎప్పారు. ఇదిలా ఉండగా.. మంగళవారం సీనియర్ అధికారులతో సమావేశం జరిగింది. పెరుగుతున్న కేసుల మధ్య కొవిడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOPs) పాటించాలని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సంక్షేమం) షాలినీ సింగ్ సూచించారు.