పాట్నా : బిహార్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. బిహార్లో పిడుగులకు 17 మంది దుర్మరణం చెందారు. ఆయా ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఉరుములు, పిడుగులతో కురిసిన వర్షానికి భాగల్పూర్లో ఆరుగురు, వైశాలి జిల్లాలో ముగ్గురు, ఖగారియాలో ఇద్దరు, బంకాలో ఇద్దరు, కతిహార్లో ఒకరు, సహర్సాలో ఒకరు, మాధేపురాలో ఒకరు, ముంగేర్లో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని సీఎం ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రతికూల వాతావరణంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడకుండా విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్తో పాటు బిహార్లో ముందుకు కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఉత్తర, మధ్య, తూర్పు భారతం అంతటా రెండు మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.