కోటా, మార్చి 8: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న 16 ఏండ్ల అభిషేక్ మండల్ గురువారం రాత్రి పేయింగ్ గెస్ట్ రూమ్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
బీహార్ భాగల్పూర్కు చెందిన అభిషేక్ తన తండ్రిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘నాన్నా.. జేఈఈ పరీక్షల్లో విజయం సాధించలేను.. క్షమించండి.. నేను వెళ్లిపోతున్నాను’ అని అందులో రాసినట్టు డీఎస్పీ ధర్మవీర్ సింగ్ తెలిపారు. జనవరి నుంచి కోటాలో ఐదుగురు ఆత్మహత్య చేసుకొన్నారు.