పట్నా: బీహార్లో పిగుడుపాటుకు 16 మంది బలయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్దఎత్తున పిడుగులు (Lightning) పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే పిడుగుపాటుతో 16 మంది మరణించారని అధికారులు తెలిపారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకు పిడుగుపాటు వల్ల మొత్తం 36 మంది మృతిచెందారని వెల్లడించారు.
మంగళవారం మరణించినవారిలో ఈస్ట్ చంపారన్ జిల్లాల్లో నలుగురు, భోజ్పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు, సరన్ జిల్లాలో ముగ్గురు, వెస్ట్ చంపారన్ జిల్లాలో ఇద్దరు, అరారియా జిల్లాలో ఇద్దరు, బంకా, ముజఫర్పూర్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, మృతుల కుంటుంబాలకు సీఎం నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు.