రాంచీ : జార్ఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. బార్బెండియా వంతెన సమీపంలో దామోదర నదిలో పడవ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది వరకు ఉన్నారు. ధన్బాద్లోని నిర్సా నుంచి జమ్తారాకు వెళ్తున్న సమయంలో పడవ బోల్తాపడింది. ఇప్పటి వరకు నలుగురిని రక్షించి, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారికి కోసం గాలిస్తున్నాయి.