న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నదని, నిరంతరంగా దాడి జరుగుతున్నదని జర్నలిస్టు సంఘాలు, మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని, మీడియా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న 16 జర్నలిస్టు, మీడియా సంస్థలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ రాశాయి.
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’కు చెందిన కార్యాలయాలు, జర్నలిస్టుల ఇండ్లలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల సోదాలు, సంస్థ ఆఫీస్ సీజ్, న్యూస్క్లిక్ డైరెక్టర్ ప్రబీర్ పుర్కాయస్థతో పాటు పలువురి అరెస్టు వంటి పరిణామాల నేపథ్యంలో ఈ లేఖ రాశాయి.