బెంగళూరు : కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను చంపుతామని బెదిరించిన కేసులో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కొడగు జిల్లాకు చెందిన వారు కాగా.. కుశాల్నగర్లో తొమ్మిదిని, మడికేరిలో ఏడుగురిని అరెస్టు చేసినట్లు కొడగు ఎస్పీ కెప్టెన్ అయ్యప్ప పేర్కొన్నారు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నట్లు పేర్కొన్నారు. సిద్ధరామయ్య వచ్చిన బెదిరింపులపై కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు.
తాము ఈ అంశాన్ని సీనియర్గా తీసుకున్నామని, తాను డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడానని, ఈ విషయంపై పోలీసుల దర్యాప్తు సాగుతుందన్నారు. ప్రతిపక్ష నేతకు తగిన భద్రత కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. కర్నాటక కొడగులో సిద్ధరామయ్య శుక్రవారం పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా పలువురు నల్లజెండాలను ప్రదర్శించడంతో పాటు కారుపై కోడిగుడ్లను విసిరారు.