న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 ;రాజకీయ పార్టీలు చేస్తున్న ఎన్నికల వ్యయం ఆకాశాన్నంటుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. 2013-14, 2022-23 మధ్య లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు చేసిన ఎన్నికల ఖర్చు (మీడియా ప్రకటనలు, ప్రయాణ ఖర్చులు, అభ్యర్థుల వ్యయాలు) ఏకంగా రూ.15,647 కోట్లుగా ఉన్నది. ఇందులో గత పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీదే 55 శాతం వాటా ఉండటం గమనార్హం.ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ 30 శాతం ఖర్చు చేసింది. అధికారంలో రాకముందు మొత్తం ఎన్నికల వ్యయంలో తక్కువగా ఉన్న బీజేపీ వాటా.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమాంతంగా పెరుగడం గమనార్హం. 2013-14కు సంబంధించి మొత్తంలో ఆ పార్టీ ఎన్నికల ఖర్చు 29 శాతం ఉండగా.. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో అది కాస్తా ఏకంగా 48 శాతానికి ఎగబాకింది. దీనిపై అహ్మదాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్థక్ బాగ్చి మాట్లాడుతూ భారత పొలిటికల్ ఫైనాన్సింగ్ చట్టంలో పార్టీల వ్యయంపై పరిమితి లేదని, అయితే అభ్యర్థి చేసే ఖర్చుపై మాత్రమే పరిమితి విధించారని పేర్కొన్నారు.
ఆకాశాన్నంటిన ఎన్నికల వ్యయం
గత రెండు లోక్సభ ఎన్నికల్లో..
2013-23 మధ్య ఎన్నికల వ్యయంలో పార్టీల వారీగా వాటా
అధికారంలో ఉంటే అలా.. లేకుంటే ఇలా!