గువాహటి: అస్సాంలోని ఐదు లోక్సభ స్థానాల పరిధిలో 150 సెట్ల ఈవీఎంలతోపాటు వాటికి సంబంధించి వీవీపాట్, బ్యాలెట్ యూనిట్లు వంటి 400కు పైగా కాంపోనెంట్లు మొరాయించాయి. దీంతో వాటిని వెంటనే మార్చాల్సి వచ్చింది. పోలింగ్కు 90 నిమిషాల ముందు నిర్వహించిన మాక్ పోలింగ్లో సమస్యను గుర్తించడంతో వెంటనే మార్చి పోలింగ్కు అంతరాయం లేకుండా చూడగలిగారు. పోలింగ్ మొదలయ్యాక కూడా వివిధ పోలింగ్ స్టేషన్ల పరిధిలోని 40కిపైగా వీవీపాట్లతోపాటు ఆరు ఈవీఎం సెట్లను మార్చినట్టు అధికారులు తెలిపారు.
మీ ఓటు పదిలం: సీఈసీ
ప్రజల ఓటు భద్రంగా ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ శుక్రవారం భరోసా ఇచ్చారు. ఈవీఎంలు వంద శాతం సురక్షితమని ఆయన పేర్కొన్నారు.