చండీఘడ్: పంజాబ్లోని అమృత్సర్లో కల్తీ మద్యం(Illicit Liquor) సేవించి 15 మంది మృతిచెందారు. మజితా ఏరియాలో ఈ ఘటన జరిగింది. మరో ఆరు మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటన జరిగిన ఆరు గంటల్లోనే కల్తీ మద్యం సరఫరా చేసిన ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరు మందిని అరెస్టు చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. భంగాలి, మరారి కలన్ గ్రామాలకు చెందిన మూడేసి మంది యువత, తరివాల్ గ్రామానికి చెందిన మరో ఇద్దరు కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అనేక మంది ఆరోగ్యం ప్రస్తుతం క్రిటికల్గా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం ఎక్కడ నుంచి సరఫరా అవుతుందో తెలుసుకునేందుకు మజితా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆదివారం సాయంత్రం ఒకే షాపు నుంచి మద్యం తాగిన వాళ్లు అస్వస్థతకు లోనైనట్లు ప్రాథమిక విచారణ ద్వారా వెల్లడైనట్లు మజితా ఎస్హెచ్వో అబ్తాబ్ సింగ్ తెలిపారు. కొందరు సోమవారం ఉదయం మరణించారు. అయితే వారి వివరాలను పోలీసులకు చెప్పకుండానే కుటుంబసభ్యులు దహనం చేశారు.
ప్రబ్జిత్ సింగ్ అనే ప్రధాన పంపిణీదారుడిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు కింగ్పిన్గా ఉన్న సాహిబ్ సింగ్ అనే వ్యక్తిని రాజసాని అనే ఏరియా నుంచి అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యం సరఫరా చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ నుంచి లిక్కర్ ఖరీదు చేసిన మరో నలుగుర్ని కూడా కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కల్తీ మద్యం కేసులో పంజాబ్ పోలీసులు పొరుగు రాష్ట్రాలపై దాడులు చేస్తున్నారు.
#WATCH | Punjab: 14 people dead and 6 hospitalised after allegedly consuming spurious liquor in Amritsar’s Majitha
Amritsar Deputy Commissioner Sakshi Sawhney says, ” An unfortunate tragedy has happened in Majitha. We got to know yesterday night, we received reports from 5… pic.twitter.com/9IauurxVyq
— ANI (@ANI) May 13, 2025