న్యూఢిల్లీ, జనవరి 23: పార్లమెంట్ భద్రత కోసం 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో వీరిని మోహరించినట్టు అధికారులు తెలిపారు. సందర్శకులను, వారి లగేజ్లను వీరు తనిఖీ చేస్తారని చెప్పారు. గత పార్లమెంట్ సమావేశాలలో భద్రతను ఉల్లంఘించి డిసెంబర్ 13న ఇద్దరు వ్యక్తులు విజిటర్ గ్యాలరీ నుంచి దూకి వచ్చి లోక్సభలో అలజడి సృష్టించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.