అహ్మదాబాద్: వేసవి సెలవుల నేపథ్యంలో ఒక బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ కుటుంబ సభ్యులు ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. భోజనం తర్వాత తోటి పిల్లలతో కలిసి ఆడుతూ, పరుగెత్తిన ఆ బాలిక కుప్పకూలి మరణించింది. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జామ్నగర్కు చెందిన 14 ఏళ్ల ఆనంది మోదీ, వేసవి సెలవుల సందర్భంగా రాజ్కోట్లోని మేనమామ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం ఆ బాలికతో సహా ఆ కుటుంబ సభ్యులు ఒక రెస్టారెంట్కు వెళ్లి డిన్నర్ చేశారు.
కాగా, భోజనం తర్వాత ఆ రెస్టారెంట్ ఆవరణలో ఇతర పిల్లలతో కలిసి ఆనంది ఆడింది. ఈ సందర్భంగా అటూ ఇటూ పరిగెత్తిన ఆ బాలిక ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయింది. ఆమెను వెంటనే హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆనంది గుండెపోటు వల్ల చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.