Adani Group | ‘దేశ ప్రాదేశిక జలాల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోర్టులు గంపగుత్తగా ఓ ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉండటం ఎంతమాత్రం మంచిది కాదు. దీంతో దేశ భద్రతే ప్రమాదంలో పడొచ్చు’.. రక్షణ రంగానికి చెందిన పలువురు నిపుణులు గత కొంతకాలంగా వ్యక్తం చేస్తున్న ఆందోళన ఇది. దీనికి కారణం..మోదీ సర్కారు దేశంలో 14 పోర్టులను అదానీ గ్రూప్నకు కట్టబెట్టడం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): 2001లో గుజరాత్లోని ముంద్రా పోర్టును మాత్రమే నిర్వహించే అదానీ గ్రూప్ కింద.. ప్రస్తుతం దేశంలోని 14 పోర్టులు, టెర్మినల్స్ ఉన్నాయి. గడిచిన 10 ఏండ్ల వ్యవధిలో ఆ గ్రూప్ ఏకంగా ఆరు పోర్టులను చేజిక్కించుకొన్నది. అంతేకాదు, దేశీయంగా జరిగే మొత్తం కార్గో వ్యాపారంలో 24 శాతం వాటా అదానీదే. ఈ మేరకు ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ దినపత్రిక పరిశోధనాత్మక కథనాన్ని వెలువరించింది.
పోర్టులు, టెర్మినల్స్లో అదానీ గుత్తాధిపత్యం వహించడంపై ప్రభుత్వానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపింది. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా మారిన తర్వాత అదానీ వ్యాపార సామ్రాజ్యం అనూహ్యంగా వృద్ధిచెందిందన్న విమర్శలు ఉన్నాయి. పోర్టులన్నీ ఒకే కంపెనీ చేతిలో ఉండిపోతే పలు నష్టాలు ఉంటాయని ప్రభుత్వాధికారులు, నిపుణులు అంటున్నారు.
అదానీ పోర్టులో మూడుసార్లు పెద్దయెత్తున మాదకద్రవ్యాలు (మొత్తంగా 3,375 కిలోల హెరాయిన్.. విలువ రూ. 25 వేల కోట్లు) దొరికాయి.
పోర్టు పేరు : పూర్వకంపెనీ
కృష్ణపట్నం : నవయుగ
కట్టుపల్లి : ఎల్ అండ్ టీ
తునా : కాండ్లా పోర్టు ట్రస్టు
దహేజ్ : పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఓఎన్జీసీ
హజీరా : షెల్గ్యాస్ బీవీ, టోటల్ గాజ్
దిఘీ : జేఎన్పీటీ
మోర్ముగోవా మోర్ముగోవా పోర్టు ట్రస్టు విజింజామ్ – ఎన్నూర్ :కామరాజర్ పోర్టు
వైజాగ్ టెర్మినల్ : విశాఖపట్నం పోర్ట్ అథారిటీ
ముంద్రా : –
కరైకల్ : –
గంగవరం : డీవీఎస్ రాజు గ్రూప్
దామ్రా : లార్సెన్ అండ్ టర్బో, టాటాస్టీల్
2013లో అదానీ పోర్టుల కార్గో నిర్వహణ షేర్ 10 శాతం కంటే తక్కువ, ప్రస్తుతం 24 శాతానికి చేరింది. ప్రభుత్వం నిర్వహణలో ఉన్న పోర్టుల కార్గో షేర్ 58.5 శాతం నుంచి 54.5 శాతానికి పడిపోయింది.
– కేంద్ర ఆర్థిక శాఖలోని ఓ అధికారి
కళాశాల చదువును మధ్యలోనే ఆపేసిన అదానీ తొలుత వజ్రాల ట్రేడింగ్లోకి దిగారు.మోదీ ఆ రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు, 2014లో పీఎంగా మారినప్పటినుంచి అదానీ ఆస్తులు రాకెట్ వేగంతో దూసుకెళ్లడం గమనార్హం.
బొగ్గు వ్యాపారంతో దశ తిరిగింది.