న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా 14 మంది గురువారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వారి చేత ప్రమాణం చేయించారు. తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెడుతున్న సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి, అశ్వినీ వైష్ణవ్ ఒడిశా నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.
ప్రమాణ స్వీకారం చేసిన వారిలో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నేత రవిచంద్ర వద్దిరాజు, ఏపీకి చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు గొల్ల బాబురావు, మేడా రఘునాథ రెడ్డి, యెర్రం వెంకట సుబ్బారెడ్డి ఉన్నారు.