భోపాల్: మధ్యప్రదేశ్లోని డిండోరి జిల్లాలో బుధ-గురువారం మధ్య రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. దాదాపు 34 మందితో ప్రయాణిస్తున్న పికప్ వాహనం సుమారు 40-50 అడుగుల లోతులోని లోయలో పడిపోయింది. సంక్లిష్టమైన మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
దుర్ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిని షాహ్పుర సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో జబల్పూర్ తరలించారు.