భదోహి: దేశంలోకి బంగారం స్మగ్లింగ్ చేసే ఇద్దరు స్మగ్లర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు భదోహి జిల్లా ఎస్పీ మీనాక్షి కత్యాన్ శనివారం వెల్లడించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) సమాచారం మేరకు ఇద్దరు స్మగ్లర్లను శుక్రవారం రాత్రి పట్టుకొన్నామని, మరొకరు పరారయ్యాడని తెలిపారు. నిందితులను మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు.