Lord Shiva | భువనేశ్వర్ : ఒడిశాలోని జైపూర్ జిల్లాలో 123 అడుగుల ఎత్తులో శివుడు కొలువుదీరాడు. ఈ విగ్రహాన్ని మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శివుడి విగ్రహాన్ని బైతరాని నదీ తీరంలోని బరహనాథ్ టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేశారు. బరహ ఖేత్ర డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో విగ్రహాన్ని నిర్మించారు.
ఇక శివుడిని దర్శించుకునే భక్తులకు అధికారులు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లిఫ్టులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్లి శివుడిని దర్శించుకోవచ్చు. శివుడి విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన ఓ ప్రయివేటు ఆర్ట్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్మించింది.
విగ్రహాంతో పాటు అక్కడ పార్కు కూడా ఏర్పాటు చేశారు. టూరిస్టులకు, భక్తులకు ఆహ్లాదం కలిగించేలా వాటర్ ఫౌంటెన్స్ను నిర్మించారు. భక్తుల కోసం విశ్రాంతి గదులను కూడా నిర్మించారు. జైపూర్ జిల్లా పర్యాటకానికి ప్రసిద్ధి. దశ్వమేధ ఘాట్, బరహా టెంపుల్, బరుణి ఘాట్, మా బైరాజా టెంపుల్స్ ను కూడా భక్తులు, పర్యాటకులు సందర్శించొచ్చు.