న్యూఢిల్లీ, జనవరి 5: దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. కరోనాతో ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్లో ఒకరు మృతిచెందారు. గురువారం నుంచి శుక్రవారం నాటికి 24 గంటల్లో దేశవ్యాప్తంగా 761 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,334కు చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 619 నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 199, కేరళలో 148, మహారాష్ట్రలో 47 వెలుగుచూశాయి.