చంద్రాపూర్: మహారాష్ట్రలోని టైగర్ రిజర్వ్లో రూ.12 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నది. చంద్రాపూర్ జిల్లాలోని టైగర్ రిజర్వ్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ మేనేజ్మెంట్కు డబ్బులు చెల్లించడం లేదు. ఆడిటింగ్ నిర్వహించగా సదరు సంస్థ రూ.12 కోట్ల అవినీతికి పాల్పడినట్టు తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.