న్యూఢిల్లీ: దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియానుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు వచ్చాయి. శనివారం మరో 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి వస్తున్నాయి. వాటిలో ఏడు మగ చిరుతలు, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా నుంచి బయలుదేరిన ఐఏఎఫ్ విమానం శనివారం ఉదయం 10 గంటలకు గ్వాలియర్ ఎయిర్ఫోర్స్ బేస్లో ల్యాండ్ అవుతుంది.
అనంతరం వాటిని ఐఏఎఫ్కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లలో కూనో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి యాదవ్ చిరుతలను క్యారంటైన్లోకి పంపనున్నారని చీతా ప్రాజెక్ట్ చీఫ్ ఎస్పీ యాదవ్ తెలిపారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వాటిని 30 రోజులపాటు క్వారంటైన్లో (ఎన్క్లోజర్) ఉంచనున్నామని చెప్పారు. అనంతరం వాటిని పెద్ద ఎన్క్లోజర్లోకి పంపిస్తామన్నారు.
ప్రతిష్టాత్మకమైన చిరుత పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను కూనో ఫారెస్ట్ వదిలిన విషయం తెలిసిందే. వాటిలో ఐదు ఆడవి, మూడు మగవి ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ లార్జ్ ఎన్క్లోజర్లో ఉన్నాయి.
దేశంలో 71 ఏండ్ల క్రితం అంతరించి పోయిన చీతాలను ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరిస్తున్నది. ఇందులో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి విడుతల వారీగా దిగుమతి చేసుకుంటున్నది. కాగా, ప్రపంచంలోని 7 వేల చిరుతల్లో అధికంగా దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానాలో నివసిస్తున్నాయి. అయితే ఈ మూడుదేశాల్లో నమీబియాలో చీతాలు అత్యధికంగా ఉన్నాయి.
They will be kept in quarantine bomas (enclosures) for 30 days as per international protocol and then based on their acclimatisation, they will be released in a larger enclosure where prey will be available: Cheetah project chief SP Yadav pic.twitter.com/4UveJEZVCv
— ANI (@ANI) February 18, 2023