కోల్కతా: పశ్చిమబెంగాల్లోని మాల్డా (Malda) జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు (Lightning ) 11 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు దవాఖానకు తరలించారు. వారిలో కిందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. బాధితులంతా పొలంలో పనిచేసుకుంటుండగా పిడుగుపడటంతో మరణించారని తెలిపారు.
కాగా, పిడుగుపాటుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఒక్కొక్కొరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాఅని అధికారులను ఆదేశించారు.