లక్నో: అయోధ్య రామాలయానికి భక్తులు పోటెత్తారు. గత 11 రోజుల్లో 25 లక్షల మంది బాలరాముడ్ని దర్శించుకున్నారని, విరాళాలు రూ.11.5 కోట్లు దాటాయని ఆలయ ట్రస్ట్ అధికారులు గురువారం తెలిపారు. ట్రస్ట్ కార్యాలయ ఇన్చార్జి ప్రకాశ్ గుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం,11 రోజుల్లో విరాళాల బాక్సుల్లో భక్తులు రూ.8 కోట్ల నగదు జమచేశారు. ఆన్లైన్, చెక్కుల రూపంలో రూ.3.50 కోట్లు అందాయి.