ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో యమునా నది ఒడ్డున త్రివేణి పుష్ప్ ప్రాంతంలో 108 అడుగుల ఎత్తయిన భగవాన్ హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. నగర కొత్వాల్గా పిలిచే హనుమంతుని విగ్రహంతో పాటు ఆలయ నిర్మాణానికి అక్కడ సుమారు 12 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఇప్పటికే గుర్తించారు. మహా కుంభమేళా కంటే ముందే 2025లోగా దీనిని నిర్మిస్తారు. హరిద్వార్కు చెందిన పరమార్ధ నికేతన్ త్రివేణి పుష్ప్ను 30 ఏండ్లకు లీజుకు తీసుకుంది. ఈ సంస్థ హనుమంతుని విగ్రహంతో పాటు పలు కట్టడాలు నిర్మించనున్నది.