ఐజ్వాల్: మిజోరం(Mizoram Assembly Elections) అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 40 స్థానాలకే ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 174 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇవాళ ఆ రాష్ట్రానికి 101 ఏళ్ల వృద్ధుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంపాయి దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ వృద్ధుడు తన భార్యతో కలిసి ఓటు వేశారు. 101 ఏళ్ల ఉన్న పూ రాల్నుదులాతో పాటు 86 ఏళ్లు ఉన్న ఆయన భార్య పి తంగలెతులై కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Mizoram Assembly Elections | Pu Rualhnudala, 101 years old and his wife Pi Thanghleithluaii, 86 years old cast their valuable votes at 24/18 Ruantlang PS under 24-Champhai South Assembly Constituency. pic.twitter.com/Wkm2pLA3FC
— ANI (@ANI) November 7, 2023
ఐజ్వాల్లో మరో వృద్ధుడు కూడా ఓటేశారు. పోస్టల్ బ్యాలెట్ను తిరస్కరించిన 96 ఏళ్ల అంధ వృద్ధుడు పూ జద్వాలా ఐజ్వాల్లోని సారన్ వెంగ్ నుంచి తన ఓటు హక్కును వాడుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు తిరస్కరించిన ఆ వృద్ధుడు.. ఇవాళ పోలింగ్ బూత్కు వెళ్లి మరీ ఈవీఎం ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
A 96-year-old visually impaired voter, Pu Zadawla who refused to cast his vote through postal ballot has cast his vote today in 1417 Saron Veng-II, Aizawl for the Mizoram Assembly elections. pic.twitter.com/JTVbClifmh
— ANI (@ANI) November 7, 2023
ఈసారి ఎన్నికల్లో మీజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), జోరమ్ పీపుల్స్ మూమెంట్(జెడ్పీఎం), కాంగ్రెస్ పార్టీలు మొత్తం 40 సీట్లల్లో తమ అభ్యర్థుల్ని రంగంలోకి దించాయి. బీజేపీ 23, ఆమ్ ఆద్మీ 4 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలో ఉంచింది.