ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అనిల్ దేశ్ముఖ్కు మరోసారి నిరాశే ఎదురైంది. రూ.100 కోట్ల బలవంతపు వసూళ్ల కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన బెయిల్ పిటిషన్పై విచారణను బాంబే హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 6న జరుపనున్నట్లు తెలిపింది.
వాస్తవానికి గత మంగళవారం కూడా అనిల్ దేశ్ముఖ్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిందది. అస్వస్థత కారణంగా అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆ రోజు కోర్టుకు రాకపోవడంతో సీబీఐ గడువు కోరింది. దాంతో కోర్టు విచాణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా.. అనిల్ దేశ్ముఖ్కు బెయిల్ మంజూరు చేయవద్దంటూ సీబీఐ గట్టిగా వాదించడంతో కోర్టు 6వ తేదీకి విచారణను వాయిదా వేసింది.
అంతకుముందు, అక్టోబర్ 21న అనిల్ దేశ్ముఖ్ బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక కోర్టు ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది. బెయిల్ మంజూరు చేస్తే ఆయన సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. దాంతో అక్టోబర్ 26న అనిల్ దేశ్ముఖ్ బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అప్పటి నుంచి దానిపై విచారణ వాయిదా పడుతూ వస్తున్నది.