న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీరులుగా చేరే వారి కోసం కేంద్ర హోంశాఖ ఇవాళ ఓ ప్రకటన చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్), అస్సారం రైఫిల్స్లో అగ్నివీరులకు పది శాతం కోటాను కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. అగ్నిపథ్ కాంట్రాక్ట్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే. అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తన ట్విట్టర్లో స్పందించింది. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్లో జాబ్లో చేరేవారికి వయోపరిమితి సడలింపు ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్లో చేరే వారికి మూడేళ్ల వయో సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ చెప్పింది. దీంతో తొలి బ్యాచ్ అగ్నివీరులకు మొత్తం అయిదేళ్ల సడలింపు లభించనున్నది.