న్యూఢిల్లీ: దేశంలో గురువారం ఒక్క రోజే 10,158 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజుకంటే 30 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 44,998కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా ఉన్నది.
మొత్తం కరోనా కేసుల్లో క్రియాశీలక కేసుల సంఖ్య 0.10 శాతం ఉన్నట్టు ఆరోగ్య శాఖ వెబ్సైట్లో వెల్లడించింది. దేశంలో రాబోయే 10-12 రోజుల్లో కేసులు పెరుగుతాయని, ఆ తర్వాత తగ్గుతాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.