మధురై: రైలులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20కిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. రైలులోకి అక్రమంగా తెచ్చిన గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్టు దక్షిణ రైల్వే తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో నుంచి వచ్చిన ‘ప్రైవేటు పార్టీ కోచ్’లో పేలుడు సంభవించినట్టు పేర్కొంది. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.