ఇంఫాల్ : మణిపూర్లో ఘర్షణ పడుతున్న కుకీ, మైతీ తెగల మధ్య సయోధ్య కుదిర్చేందుకు శాంతి చర్చలను తక్షణం ప్రారంభించాలని గవర్నర్ అనుసూయి యూకీని 10 రాజకీయ పార్టీల ప్రతినిధి బృందం కోరింది. కేంద్రం, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని తెలిపింది.
ఇదిలావుండగా, కుకీ-జో తెగలకు చెందిన ఐటీఎల్ఎఫ్ సంస్థ బుధవారం ఓ హెచ్చరిక చేసింది. తమ జాతుల ప్రాబల్యంగల ప్రాంతాల్లో స్వయంపాలిత ప్రత్యేక పాలనను ఏర్పాటు చేసుకుంటామని తెలిపింది. ఇది చట్టవిరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.