రాయ్పూర్, సెప్టెంబర్ 16: ఛత్తీస్గఢ్లో సంచలనం సృష్టించిన ఝీరాం ఘాటీ మారణకాండ కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 10 మంది మావోయిస్టులకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులోని నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సింగ్ రాజ్పుట్ బుధవారం తీర్పు చెప్పారు. నిందితులు ప్రస్తుతం జగదల్పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 2013 మే 25న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న పరివర్తన్ యాత్ర వాహనాల కాన్వాయ్ పై సీపీఐ (మావోయిస్టు) సాయుధ కార్యకర్తలు మారణాయుధాలతో దాడి చేయగా, 30 మంది మరణించారు. వారిలో 10 మంది పోలీసులు ఉన్నారు. 38 మంది గాయపడ్డారు. మృతుల్లో గిరిజన నేత మహేంద్ర కర్మ, అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నంద్ కుమార్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా కూడా ఉన్నారు.