జమ్ము, అక్టోబర్ 25: ఉగ్రదాడులకు భయపడి కశ్మీరీ పండిట్లు గ్రామాలను వదిలివెళ్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో పలువురు మృతిచెందగా, పది కశ్మీరీ పండిట్ల కుటుంబాలు భయంతో షోపియాన్ జిల్లాలోని చౌదరిగుండ్ గ్రామాన్ని వదిలి వెళ్లాయి. దాదాపు 35నుంచి 40 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జమ్ముకు చేరుకొన్నారు.
కశ్మీర్ లోయలో నివసించే పరిస్థితి లేదని, భయం గుప్పిట బతుకుతున్నామని పేర్కొన్నారు. తమ ప్రాణాలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తంచేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరినా.. ఊరికి దూరంగా పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.