జార్ఖండ్లోని దేవ్గఢ్ జిల్లాలో రోప్వే కేబుల్ కార్లు ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురయ్యాయి. కేబుల్ కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దేవ్గఢ్లోని ప్రముఖ బైద్యనాథ్ దేవాలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికూట్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 50 మంది ప్రయాణికులు 24 గంటల పాటు రోప్వే క్యాబిన్లలో చిక్కుకుపోయారు. ఎంఐ-17 హెలికాప్టర్ల ద్వారా 22 మందిని రక్షించారు. ఇంకా దాదాపు 20 మందికి పైగా పర్యాటకులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరికీ డ్రోన్ల ద్వారా ఆహారపదార్థాలు సరఫరా చేశారు.