న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది. చెరుకు పంట ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్(ఎఫ్ఆర్పీ)ని క్వింటాల్కు రూ.10 పెంచింది. దీంతో అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023-24 సీజన్కు క్వింటాల్ ధర స్వల్పంగా పెరిగి రూ.315 చేరింది. రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3.70 లక్షల కోట్ల కేటాయింపు నకు ఆమోదం లభించింది. నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు బిల్లును క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.