రాజ్కోట్: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గార్బా నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న10 మంది గుండెపోటుతో మరణించడంతో గుజరాత్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. మృతుల్లో బరోడా, దభోయికి చెందిన 13 ఏళ్ల బాలుడి నుంచి మధ్య వయస్కులు ఉండటం కలవరపరుస్తున్నది. అహ్మదాబాద్కు చెందిన 24 ఏండ్ల యువకుడు శుక్రవారం నృత్యం చేస్తూ కుప్పకూలి, ప్రాణాలు కోల్పోయారు. కపడ్వంజ్కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత ఆరు రోజుల్లో 108 అంబులెన్స్ సర్వీస్కు గుండె సమస్యలపై 521 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఊపిరి సంబంధిత సమస్యలపై 609 ఫోన్ కాల్స్ వచ్చాయి.