లక్నో : ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మీర్జాపూర్లోని ఘాఘ్రా నదిలో బుధవారం ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది నీటిలో మునిగి గల్లంతయ్యారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందం సహాయక చర్యలు ప్రారంభించాయి. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన దాదాపు మంది బుధవారం పడవలో నది మీదుగా తమ పొలాలకు వెళ్తున్నారు.
నీటిలో తేలుతున్న కలపను తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పడవ అదుపు తప్పి బోల్తాపడింది. మరో వైపు బన్బాసా బ్యారేజీ నుంచి దాదాపు ఐదు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి పాలియా, బీరా మధ్య ప్రధాని రహదారిపై నీరు ముంచెత్తింది. ధౌరారాలో 15 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం ఘఘ్రా నదిలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.