Madhya Pradesh | భోపాల్, నవంబర్ 11: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ర్టానికి గతంలో సీఎంలుగా పనిచేసిన ఐదుగురి కుమారులు బరిలో నిలిచారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఉన్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్ధన్ సింగ్ తమ కుటుంబానికి గట్టి పట్టున్న రఘోఘర్ నుంచి పోటీచేస్తున్నారు.
1960వ దశకం ఆఖరులో సీఎంగా పనిచేసిన గోవింగ్ నారాయణ్ సింగ్ కుమారుడు ధ్రువ్ నారాయణ్ భోపాల్ సెంట్రల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 1977-78 మధ్య జనతా పార్టీ సీఎంగా చేసిన కైలాశ్ జోషి కుమారుడు దీపక్ జోషి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇంకా మధ్యప్రదేశ్కు గతంలో సీఎంలుగా చేసిన వీరేంద్ర కుమార్ సక్లేచా, అర్జున్ సింగ్ కొడుకులు ఓంప్రకాశ్ సక్లేచా, అజయ్ సింగ్ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.