పాట్నా: బీహార్లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన (Under Construction Bridge) కుప్పకూలింది. దీంతో ఒకరు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్ జిల్లాలోని మరీచా సమీపంలో భేజా మరియు బకౌర్ మధ్య కోసీ నదిపై (Kosi river) భారీ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు బ్రిడ్జిలోని ఒక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద 30 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని.. మరో తొమ్మిది మంది గాయపడ్డారని సుపాల్ డీఎం కౌశల్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని దవాఖానకు తరలించామని చెప్పారు. ఈ ఘనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రూ.1700 కోట్లకుపైగా అంచనా వ్యయంతో కోసి నదిపై భగల్పూర్, ఖగారియా జిల్లాలను కలిపేలా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2014లో శంకుస్థాపన చేశారు. 2019లో పనులు పూర్తవ్వాల్సి ఉన్నప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
#UPDATE | Supaul, Bihar: One died and nine injured as a portion of an under-construction bridge collapsed near Maricha between Bheja-Bakaur: Supaul DM Kaushal Kumar https://t.co/DhsS9ZCCws
— ANI (@ANI) March 22, 2024