గౌరీబిదనూర్లో కమలం పార్టీ ఐదో స్థానంలో ఉన్నది. ఇక్కడ బీజేపీ కంటే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి కేహెచ్ పుట్టస్వామి గౌడ 83,177 ఓట్లతో విజయం సాధించగా, మరో స్వతంత్ర అభ్యర్థికి 23 వేల ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం కేవలం 8,024 ఓట్లే పడ్డాయి. చింతామణిలో కమలం పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకొన్నది. ముల్బగల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 9,036. బాగేపల్లి, చిక్కబల్లాపుర్లో బీజేపీ అభ్యర్థులు వరుసగా 20, 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.