న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పండుగలను ప్రజలు ఇండ్లలోనే జరుపుకోవాలని, గుంపులు గుంపులుగా జరుపుకోవద్దని కేంద్రప్రభుత్వం కోరింది. ఒకవేళ పండుగలను సమూహాలుగా నిర్వహించుకోవడం తప్పనిసరి అయితే.. రెండు డోసుల టీకా వేసుకొన్నవారే అలా జరుపుకోవాలని సూచించింది. అయితే దీనిని సాధ్యమైనంతవరకు నివారించాలని నొక్కి చెప్పింది. పండుగల సీజన్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కరోనాపై ప్రజలను మరోమారు అప్రమత్తం చేసింది. దేశంలో సెకండ్ వేవ్ ఇంకా పోలేదని, 39 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువ ఉందని తెలిపింది. మరో 38 జిల్లాల్లో 5-10% మధ్యలో ఉన్నట్టు వెల్లడించింది. దేశంలో 16% మంది వయోజనులు రెండు డోసుల టీకా వేసుకొన్నారని, 54% మంది కనీసం ఒక్క డోసు తీసుకొన్నారని తెలిపింది. సిక్కి, దాద్రా, నాగర్ హవేలీ, హిమాచల్ప్రదేశ్లో వయోజనులందరూ కనీసం ఒక్కడోసు కరోనా టీకా వేసుకొన్నారని వెల్లడించింది. దేశంలో 300 డెల్టాప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్టు ఈ సందర్భంగా వెల్లడించింది.
విదేశీయుల వీసా గడువు 30 వరకు పొడిగింపు
కరోనా కారణంగా భారత్లో చిక్కుకుపోయిన విదేశీయులకు కేంద్రం ఊరట కలిగించింది. వారి వీసాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది. ఇందుకుగాను విదేశీయులు ఎలాంటి అదనపు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. భారత్లో కరోనా విజృంభించిన తొలినాళ్ల నుంచి విదేశీయుల వీసాల గడువును కేంద్రం పొడిగిస్తున్న విషయం తెలిసిందే.