న్యూఢిల్లీ: కరోనా టీకా ‘జైకొవ్-డీ’ని కూడా త్వరలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉపయోగించనున్నారు. ఈ టీకా కోటి డోసుల కోసం కేంద్రం ఆర్డర్ చేసింది. జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేస్తున్న ఈ టీకాను మూడు డోసులుగా వేస్తారు. సూది ఉపయోగించకుండా వేయడం దీని ప్రత్యేకత. ప్రపంచంలో డీఎన్ఏ ఆధారిత తొలి కరోనా టీకా కూడా ఇదే. 12 ఏండ్ల పైబడిన వయస్కులకు ఈ టీకా వేస్తారు. అయితే సరిపడా ఉత్పత్తి లేనందునే ప్రస్తుతం పెద్దలకు మాత్రమే ఈ టీకాను వేయయనున్నట్టు సమాచారం.