శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని జమ్ములో పేలుడు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జమ్ము సమీపంలోని సిధ్రా వంతెన (Sidhra Bridge) వద్ద అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో అక్కడ భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సిధ్రా బ్రిడ్జి చెకింగ్ పాయింట్ వద్ద భారీ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
పేలుడు ఘటనకు కారణాలపై తాము సోదాలు జరుపుతున్నామని జమ్ము సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లి తెలిపారు. ఈ పేలుడు ఘటనకు పాల్పడ్డ వారు ఎవరనేది ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.