న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. అయితే పలుచోట్ల అపశ్రుతి చోటుచేసుకున్నది. నాలుగు రాష్ర్టాల్లో 29 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా మహారాష్ట్రలో 19 మంది చనిపోయారు. వారిలో 14 మంది నీటిలో మునిగిపోవడంతో మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
ఉత్తరప్రదేశ్లో ముగ్గురు చనిపోయారు. అలాగే హర్యానాలోని మహేందర్గఢ్, సోనీపట్ జిల్లాల్లో ఆరుగురు నీట మునిగి చనిపోయారు. హైదరాబాద్లో వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్న వాహనం వెనుక చక్రాలు ఎక్కడంతో ఓ యువకుడు మృతి చెందాడు.