తిరువనంతపురం : కకేరళలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 కట్టడికి గతంలో అమలు చేసిన వీకెండ్ లాక్డౌన్లో భాగంగా ఆదివారాల్లో లాక్డౌన్ తిరిగి కొనసాగించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కేరళలో గడిచిన 24 గంటల్లో 30,007 తాజా పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు గురువారం 18.03 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న తాజా కరోనా పాజిటివ్ కేసుల్లో 60 శాతం పైగా కేరళలోనే నమోదవుతుండటంతో వైరస్ కట్టడికి అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. కఠిన నియంత్రణలు, వారాంతపు లాక్డౌన్లను అమలుచేయడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేపడుతున్నారు.