పుణె, నవంబర్ 6: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా దవాఖానలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కి 11 మంది కరోనా రోగులు చనిపోయారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఐసీయూలో దాదాపు 20 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది దవాఖానకు చేరుకొన్నారు. కానీ అప్పటికే 10 మంది చనిపోయారు. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మరణానికి కారణం గాయాలా.. లేక ఆక్సిజన్ అందక చనిపోయారా.. అన్నది నిర్ధారించనున్నారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏప్రిల్లో కూడా పాల్గఢ్లోని ఓ ప్రైవేటు దవాఖానలో మంటలు చెలరేగి 9 మంది చనిపోయారు.