లక్నో, ఏప్రిల్ 27: లఖింపూర్ ఖీరీ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ విచారణ నుంచి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్సింగ్ తప్పుకున్నారు.
జస్టిస్ రాజీవ్ గతంలో ఆశిష్కు బెయిల్ మంజూరు చేయగా, సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఆశిష్ మిశ్రా తాజాగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తాను విచారణ జరుపనంటూ జస్టిస్ రాజీవ్ తప్పుకున్నారు. ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు.