న్యూఢిల్లీ: దేశమంతా కరోనా రెండోవేవ్ కేసులు పెరుగుతుండటంతో 45 ఏండ్ల నుంచి ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేయాలన్న డిమాండ్ వేగం పుంజుకుంటున్నది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ దారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) మాత్రం భారతీయులందరికీ సరిపడా వ్యాక్సిన్లు తయారు చేయడం అంత తేలిక కాదని చెబుతున్నది. అర్ధంతరంగా పెరిగిపోయే డిమాండ్లను అందుకోవడం కష్ట సాధ్యం అని సీరం సీఈవో అడార్ పూనావాలా పేర్కొన్నారు.
ఇప్పటికిప్పుడు భారతీయులందరికీ సరిపడా వ్యాక్సిన్లను ప్రపంచంలోని ఏ సంస్థ సిద్ధం చేయలేదని మంగళవారం అడార్ పూనావాలా చెప్పారు. ప్రభుత్వ నిధులు, బ్యాంకుల రుణాలతో వచ్చే రెండు, మూడు నెలల్లో వ్యాక్సిన్ల తయారీ వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైతే తమ కంపెనీకి 60-70 మిలియన్ల డోస్ల తయారీ సామర్థ్యం కలిగి ఉందన్నారు.
గత ఫిబ్రవరి నాటికి 100 మిలియన్ల డోస్ల వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యం పెంచుకోగలమని ఆశలు పెట్టుకున్నామని అడార్ పూనావాలా తెలిపారు. కానీ జనవరిలో తమ యూనిట్లో అగ్ని ప్రమాదం సంభవించడం ఆ ఆశలను అడియాసలు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అకస్మాత్గా కరోనా కేసులు పెరిగిపోవడం పట్ల పూనావాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది అసాధారణ స్థాయి అని పేర్కొన్నారు. భారతదేశానికి మరిన్ని డోస్లు అవసరం అని తామెన్నడూ ఊహించలేదని పేర్కొన్నారు. వచ్చే మూడు నెలల్లో 40-50 మిలియన్ల డోస్ల తయారీ సామర్థ్యం పెరుగవచ్చునన్నారు. అదీ అమెరికా చేసే కొత్త చట్టంపై ఆధారపడి ఉందన్నారు.
కొవోవోక్స్ తయారీకి అవసరమైన ముడి సరుకులను అభివ్రుద్ధి చేసేందుకు ఆరు నెలల సమయం పడుతుందన్నారు అడార్ పూనావాలా. పిల్లలకు వ్యాక్సినేషన్తోనే రక్షణ కల్పించగలమన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్తో బోలెడు బెనిఫిట్లు!
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్