నల్లగొండ, జనవరి 2 : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి హాజరై కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభింంచారు. ఈ సందర్భంగా గుత్తా అమిత్రెడ్డితోపాటు పలువురు రక్తదానం చేశారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో రోగులు, సహాయకులకు అల్పాహారం అందజేశారు.
అనంతరం జడ్పీ చైర్మన్ నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. సుఖేందర్రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సేవలో భాగమైన వ్యక్తి అన్నారు. ఆయన శ్వాస, ధ్యాస మొత్తం ప్రజలే అన్నారు. ఆయన దారిలోనే కుమారుడు అమిత్రెడ్డి నడుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం దర్వేశిపురం ఎల్లమ్మ ఆలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూజలు చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, కౌన్సిలర్లు యామ కవితాదయాకర్, అభిమన్యు శ్రీనివాస్, నాయకులు మాలె శరణ్యారెడ్డి, అయితగోని స్వామిగౌడ్, హరికృష్ణ, వెంకటేశ్వర్రావు, గోపాల్రెడ్డి, ముక్తదర్, హన్ను, సహదేవ్రెడ్డి, రాజు, శ్రీనివాస్, రజితావెంకట్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నర్సిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, శ్రీనివాస్, మొయిజ్, మల్లయ్య, సైదులు పాల్గొన్నారు.
చిట్యాలలో గుత్తా యువసేన అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గుత్తా అమిత్రెడ్డి స్థానిక కనకదుర్గ ఆలయంలో సుఖేందర్రెడ్డి పేరున పూజలు చేశారు. అనంతరం అన్నదానం ప్రారంభించారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. యాద్గార్పల్లి, జంకుతండాలో జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం గుత్తా సుఖేందర్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గుర్రంపోడులో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, చందంపేటలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య ఆధ్వర్యంలో గుత్తా జన్మదిన వేడుకలు నిర్వహించారు.