నార్కట్పల్లి, అక్టోబర్ 29 : కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు షురువైతయి..కుర్చీ కోసం కొట్లాడే నాయకులకు ప్రజలను పట్టించుకునేంత సమ యం ఉండదని, నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మరోసారి ఆశీర్వాదించాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి కోరారు. ఎమ్మెల్యేకు మద్దతుగా మండలంలోనిఅమ్మనబోలు గ్రామంలో ఆదివారం వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముం దుగా డప్పు చప్పుళ్లు, కోలాటాలతో మహిళలు ఊరేగింపుగా వెళ్లి కుంకుమ దిద్ది స్వాగతం పలిలకారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మనబోలు మండ లం కావలన్నది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అని అందులో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉం దని అది కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. మండల సాధన కోసం జేఏసీ సభ్యులంతా తెలంగాణ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్ల్లి ప్రజలకు వివరించాలన్నారు. మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఊర్లోకి వస్తున్నారని వారి మాటలు నమ్మెద్దన్నారు.ఈ మండల వాసిగా ప్రజల కష్టాలు తెలిసిన వాడిని కనుక కారు గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా చిరుమర్తిని గెలిపించాలని జడ్పీ చైర్మన్ కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, సర్పంచ్ బద్దం వరమ్మా రాంరెడ్డి, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి పాల్గొన్నారు.
నకిరేకల్ : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని త్వరలో జరుగనున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వాదించాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని చందుపట్ల, మండలాపురం, మర్రూర్ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను, పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు అడిగారు. పలు వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన రైతుబంధు పెంపు, ఆసరా పింఛన్ల పెంపు, రూ.400 లకే గ్యాస్, సౌభాగ్యలక్ష్మి పథకంలో భాగంగా బీపీఎల్ కుటుంబాల మహిళలకు నెలకు రూ.3 వేలు గౌరవ వేతనం పథకాలను ఓటర్లకు వివరిస్తూ గడపగడపకూ తిరిగారు.
పార్టీ అధికారంలోకి వస్తే వారికి పెరిగే పెన్షన్ గురించి వివరించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గొర్ల సరితావీరయ్య, చందుపట్ల ఎంపీటీసీ ఇమ్మడపాక లక్ష్మీవెంకన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, చింతల సోమన్న, సిలువేరు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, నాయకులు సోమ యాదగిరి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మండలాపురం సర్పంచ్ గుడుగుంట్ల లక్ష్మమ్మాశంభయ్య, వనం చందర్రావు, సైదులు, దామోదర్ పాల్గొన్నారు.