నల్లగొండ సిటీ ఏప్రిల్ 9 : వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలని జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కనగల్, గుర్రంపోడు మండలాల అధికారులకు కనగల్ ఎంపీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎండలు అధికంగా రావడంతో పాటు వర్షాలు లేక నీటి ఎద్దటి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
నీరు సరిపోని పక్షంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతామని తెలిపారు. ప్రతి రోజు అధికారులు గ్రామాలను సందర్శించి నీటి సమస్యలను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ మురళి, కనగల్ ఎంపీడీఓ రామయ్య, గుర్రంపోడు ఎంపీడీఓ శైలజ, ఆర్డబ్ల్యూస్ డీఈ ముజీపుద్దీన్, ఏఈ షఫీ, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం హరి ఉన్నారు.
కేతేపల్లి : వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున అధికారులు రోజు గ్రామాలను సందర్శించి సమస్యను తెలుసుకోవాలని డీఆర్డీఏ పీడీ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరంలో శుక్రవారం కేతేపల్లి, శాలిగౌరారం మండల, గ్రామస్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రామాల్లో తాగు నీటి పైప్లైన్లు, మోటర్లు మరమ్మతులు ఉంటే ఒక్క రోజులో పని పూర్తి తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఉపాధి హామీ కూలీలకు పనిదినాలకు సరిపడా పని కల్పిస్తూ రోజువారీ కూలీ డబ్బులు రూ.300 అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఆదర్శ పాఠశాల విద్యార్థులకు అవసరమైన యూనిఫారాలను జూన్ 12 లోపు సమకూర్చుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, డీఎల్పీఓ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, అధికారులు పాల్గొన్నారు.