నకిరేకల్, నవంబర్ 27: సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు యువత అడుగులు వేస్తున్నదని, అందుకు చేరికలే నిదర్శనమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొ న్నారు. మండలంలోని చందుపట్ల గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 100 మంది యువత టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ర్టాభివృద్ధికి యువత కృషిచేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో పుల్లెంల ముత్తయ్య, మాచర్ల సుధాకర్, కొల్లు శ్రీకాంత్, చింతమల్ల సాగర్, చింతమల్ల చిన ముత్తయ్య, జిల్లా యల్లయ్య తదితరులున్నారు.
కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ చందుపట్ల గ్రామ శాఖాధ్యక్షుడు చందర్రావు, యువజన మండలి అధ్యక్షుడు బెజవాడ నరేశ్, సభ్యులు వెంకటేశ్వర్లు, కొప్పు నాగరాజు, రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, నాగరాజు, సోమేశ్వర్, సాయి, సం దీప్, సైదులు,నాయకులు జిల్లా జానయ్య, నర్సింహారావు, వెంకటనారాయణ, భవానీ, సుదర్శన్ పాల్గొన్నారు.
నకిరేకల్ను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే
నకిరేకల్ పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మార్నింగ్ వాక్లో భాగంగా ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులను 3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. రూ.26 కోట్లతో ప్రధాన రహదారి పనులను ప్రారంభించామని, తిప్పర్తి రోడ్డు, మార్కెట్ రోడ్డు అభివృద్ధికి రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. రూ. 32 కోట్లతో వంద పడకల ఆస్పత్రి పనులకు భూమిపూజ చేశామన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ ఉమారాణీకృష్ణమూర్తి, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు.
చందుపట్లకు చెందిన గోనె లక్ష్మణ్రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన్ను ఆదివారం ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శించి రూ.10 వేల సాయం అందజేశారు.
చందుపట్లలో వీరనారి రుద్రమదేవికి ఘన నివాళి
నకిరేకల్ : రాణి రుద్రమదేవి మరణ ప్రస్థానాన్ని తెలిపే ఏకైక చారిత్రక ఆధారం చందుపట్ల శాసనమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చందుపట్ల గ్రామ వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలోని శిలాశాసనం వద్ద రాణి రుద్రమదేవి 773వ వర్ధంతి నిర్వహించారు. రుద్రమదేవి మరణ శిలాశాసనానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చందుపట్ల శాసనం కాకతీయ చరిత్రను, రుద్రమదేవి వీరత్వాన్ని తెలిపే అతిముఖ్యమైనది అన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే మహనీయుల ఆశయ సాధనకు కృషి జరుగుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్కు రుద్రమదేవి వారసులున్న చందుపట్లపై ప్రత్యేక అభిమానముందని పేర్కొన్నారు.
అనంతరం వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి మొమెంటో అందజేశారు.